అన్నదాన ప్రసాదానికి విరాళం అందజేసిన కృష్ణ మూర్తి చారి

politics Telangana

మనవార్తలు, శేరిలింగంపల్లి :

పటాన్ చెరువు మండలం చిటుకుల గ్రామం ఆదర్శ్ నగర్ కాలనీ లో వెలసిన స్వయంభు శ్రీ తుల్జా భవాని మాత మందిరం లో దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా ఆలయ వ్యవస్థాపకులు జనార్ధన్ చారి మాత విజయలక్ష్మి ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు చండీ హోమం, నిత్య అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి మరియు రాజేందర్ చారి అన్న ప్రసాదం కొరకు 5 వేల రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక సిబ్బంది చవ్వరమేష్, పవన్ కుమార్ చారి, కాళిదాస్ చారి , పంతులు బృందం గౌతమ్ స్వామి, రానోజు మధు పంతులు,రవి చారి,రానోజు నవీన్ చారి,రానోజు నరేందర్ చారి అందరూ కుటుంబ సమేతంగా అమ్మవారి పూజలలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *