పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాద్ నగర తొలి మేయర్, ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ఆధ్యుడు అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. కొరవి కృష్ణస్వామి 137 వ జయంతి వేడుకలను పురస్కరించుకొని చిట్కుల్లోని ముదిరాజ్ సంఘం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నీలo మధు ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజుల ముద్దుబిడ్డ మహానేత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ అని ఆయన హైదరాబాద్ మహానగర అభివృద్ధికి అనితర సాధ్యంగా కృషి చేశాడన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, కవిగా, జర్నలిస్టుగా, పేదోళ్ల నాయకుడిగా ప్రజల మనసు దోచుకున్నాడని తెలిపారు. హైదరాబాద్ తొలి మేయర్ గా సేవలందించిన సమయంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసి మహానగర అభివృద్ధిపై చెరగని ముద్ర వేసిన ఘనత ఆయనకే సొంతమన్నారు. ముదిరాజ్ జాతి ఐక్యత కోసం ముదిరాజ్ మహాసభ సంఘాని స్థాపించి మన జాతి అభివృద్ధి కోసం ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. ఆ మహానేత స్ఫూర్తితో మనమంతా కలిసి ముందుకు సాగాలన్నారు.ఆయన అందించిన పోరాటస్ఫూర్తితో ముదిరాజులంతా రాజకీయంగా,సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని సమాజ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ గ్యారేల శీను, వి నారాయణ రెడ్డి, పొట్టి నారాయణ రెడ్డి,వెంకటేశ్,గోపాల్,శ్రీనివాస్, రాము,తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…