Telangana

మైత్రి మైదానం లో హోరా హోరీగా ముగిసిన కాంతయ్య మెమోరియల్ ఉమెన్స్ హాకీ టోర్నమెంట్

_విజేతగా నిలిచిన చంద్ర కాంతయ్య అకాడమీ సంగారెడ్డి జట్టు

_రన్నరప్ గా నిలిచిన జింఖానా బి సికింద్రాబాద్ జట్టు

_విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు:

పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న చంద్రకాంతయ్య మెమోరియల్ ఉమెన్స్ హాకీ 5A సైడ్ టోర్నమెంట్ సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ముగిసింది. మైత్రి మైదానం ప్రారంభ రోజున మంత్రి హరీష్ రావు చేతులమీదుగా హాకీ టోర్నమెంట్ ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. వివిధ జిల్లాల నుండి 10 జట్లు టోర్నమెంట్లో పాల్గొన్నాయి. చివరి రోజైన సోమవారం సాయంత్రం చంద్రకాంత అకాడమీ సంగారెడ్డి జట్టు -జింఖానా బి సికింద్రాబాద్ జట్ల మధ్య తుది పోరు జరిగింది. హోరాహోరీగా సాగిన పోటీలో చంద్రకాంతయ్య అకాడమీ జట్టు ఘన విజయం సాధించింది.

అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి మైదానాన్ని 7 కోట్ల 25 లక్షల రూపాయలతో పూర్తిస్థాయిలో ఆధునీకరించడం తో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. స్వతహాగా క్రీడాకారుడు అయిన తాను నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే మైత్రి మైదానాన్ని ఆధునీకరించడంతో పాటు, ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 3 మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు.

 

ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులు చేయడంలో చూపించే శ్రద్ధ క్రీడలపై ఆసక్తి పెంపొందించడం పై కనబరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలపై మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం, ఏకాగ్రత లభిస్తోందని అన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు.మూడు రోజుల పాటు హాకీ టోర్నమెంట్ను దిగ్విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. అనంతరం ప్రథమ విజేతకు 15 వేల రూపాయలు, రన్నరప్ కు 10 వేల రూపాయలు, తృతీయ స్థానంలో నిలిచిన వరంగల్ చెట్టుకు ఐదు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ అందించడంతోపాటు ట్రోఫీలను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పీటీసీ లు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సిఐ లు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, విజయ్ భాస్కర్ రెడ్డి, పరమేష్ యాదవ్, షేక్ హుస్సేన్, హాకీ అసోసియేషన్ ప్రతినిధులు కృష్ణ, రఘునందన్ రెడ్డి, చంద్ర శేకర్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హన్మంత్ రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

4 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

4 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago