క్యాలెండర్ ను ఆవిష్కరించిన జ్యోతి విద్యాలయ సిబ్బంది

Districts politics Telangana

మనవార్తలు , శేరిలింగంపల్లి :

నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను రామచంద్రాపురం మండలం లోని బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యాలయ హై స్కూల్ ఫాదర్ ఆంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, ఉపాధ్యాయురాళ్ళ తో కల్సి మంగళవారం రోజు ఆష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు.

పత్రికలు నిజాలను నిర్భయంగా వార్తలు రాయాలని, అందులో నవతెలంగాణ ది ప్రత్యేకమైన పాత్ర ఉందన్నారు. ఏ పార్టీకి కోమ్ము కాయకుండా, ప్రజల కష్టాలను తెలుసుకుంటూ అధికారుల, పాలకులకు వారధిగా పని చేసి ప్రజా సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తుందని, అందుకు పాత్రికేయులు నిష్పక్షపాతoగా పని చేయాలన్నారు ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే నాయకులకు, అధికారులుకు, ప్రజలకు, పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక విలేకరి నర్సింలు ముదిరాజ్, ఉపాద్యాయ బృందం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *