పటాన్ చెరు
పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామపంచాయతీ పరిధిలోని మంగళవారం రోజు జాతీయ రహదారి పక్కన నిర్మాణాలను తొలగించడం సరియైంది కాదని, మా సొంత పట్టా భూముల్లోనే నిర్మాణాలు చేపట్టామని బాధితులు ముత్తంగి గ్రామానికి చెందిన గడ్డ యాదయ్య, పుణ్యవతి తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మా పెద్దలు సంపాదించిన పట్టా భూమి ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 528 లో కొన్ని షాపులు నిర్మాణాలు చేపట్టామని అన్నారు. వీటి పైన కోర్టులో విచారణ నడుస్తున్నాయని తెలిపారు. గురువారం కూడా కోర్టులో ఇయరింగ్ ఉందని పేర్కొన్నారు.
వీటన్నింటికీ పట్టించుకోకుండా పంచాయతీరాజ్ అధికారులు మా సొంత నిర్మాణాలను కూల్చివేయడం దుర్మార్గమని ఆరోపించారు. మా సొంత స్థలం పక్కనే ఉన్న రవీందర్ రెడ్డి అధికారులకు మ్యానేజ్ చేసి మాపై ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై కోర్టులోనే తేల్చుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డ సుదర్శిని, అనంతయ్య, రత్నమ్మ, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…