పటాన్ చెరు
పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామపంచాయతీ పరిధిలోని మంగళవారం రోజు జాతీయ రహదారి పక్కన నిర్మాణాలను తొలగించడం సరియైంది కాదని, మా సొంత పట్టా భూముల్లోనే నిర్మాణాలు చేపట్టామని బాధితులు ముత్తంగి గ్రామానికి చెందిన గడ్డ యాదయ్య, పుణ్యవతి తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మా పెద్దలు సంపాదించిన పట్టా భూమి ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 528 లో కొన్ని షాపులు నిర్మాణాలు చేపట్టామని అన్నారు. వీటి పైన కోర్టులో విచారణ నడుస్తున్నాయని తెలిపారు. గురువారం కూడా కోర్టులో ఇయరింగ్ ఉందని పేర్కొన్నారు.
వీటన్నింటికీ పట్టించుకోకుండా పంచాయతీరాజ్ అధికారులు మా సొంత నిర్మాణాలను కూల్చివేయడం దుర్మార్గమని ఆరోపించారు. మా సొంత స్థలం పక్కనే ఉన్న రవీందర్ రెడ్డి అధికారులకు మ్యానేజ్ చేసి మాపై ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై కోర్టులోనే తేల్చుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డ సుదర్శిని, అనంతయ్య, రత్నమ్మ, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…