Telangana

తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక 20 24 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక 20 24 సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు భేరీ రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్, గుల్ మోహర్ కాలనీ అధ్యక్షులు ఖాసీం సార్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు తెల్ల హరికృష్ణ పాల్గొని తన సందేశంలో తెలంగాణ మొత్తం రాష్ట్రంలో బీసీ ఐక్యవేదిక జేఏసీ విస్తరించి ఐకమత్యం ద్వారా ఒకే గొడుగు కిందికి తీసుకొని రావాలని కోరారు. జాతీయ అధ్యక్షులు కస్తూరి గోపాల కృష్ణ జిల్లాల వ్యాప్తంగా కమిటీలు వేసి మనం బీసీల కొరకు పని చేద్దామని తెలిపారు బీసీ వికాస సమితి అధ్యక్షులు నర్సింగరావు మాట్లాడుతు ఐకమత్యమే మహాబలం రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం బీసీ లందరూ తప్పక పోటీ చేసి రాజ్యాధికారం వైపు దూసుకుపోవాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. జనగణన, కుల గణన చేయాలనీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.రాబోయే ఎంపీ ఎలక్షన్లో అన్ని పార్టీలు బీసీలకు 30 నుండి 50 శాతం వరకు సీట్లు కేటాయించాలని కోరారు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీసీ రథయాత్ర చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా బీసీలను కలిసి అన్ని కుల సంఘాలను కలుపుకొని జేఏసీ ద్వారా రాజ్యాధికారం వైపు తీసుకెళ్లటానికి ప్రయత్నం చేస్తామని. అగ్రవర్ణాలు మనకు అధికారం అప్పగించరు మనమే ఏకమై మన ఓటు మనకు నినాదంతో రాజ్యాధికారం సాధిద్దామని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ తో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరు కలుపుకొని రాజ్యాధికారం వైపు దూసుకెళ్తామని భేరీ రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో వికాస్ నర్సింగరావు, మధుకరాచారి, ఆర్కే సాయన్న, ఎస్సీ జేఏసీ అధ్యక్షులు నరసింహ, వెంకటేశ్వరరావు సార్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, కుమార్ యాదవ్, మధు యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago