ఘనపూర్ గ్రామంలో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభోత్సవం

politics Telangana

_కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు

_వచ్చే నెలలో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు, ఉచిత పరీక్ష సామాగ్రి పంపిణీ

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు ఆధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాలల భవనాలను నిర్మిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరువు మండలం ఘనపూర్ గ్రామంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు మన ఊరు మనబడి ద్వారా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు పక్కా భవనాలను నిర్మించామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలలోనూ ప్రభుత్వం మరియు సి ఎస్ ఆర్ నిధులతో పక్కా భవనాలు నిర్మించామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల మూలంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం సిఫార్సులు చేయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.ఘనాపూర్ గ్రామంలో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనంలో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులకు సూచించారు.నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 7000 మంది విద్యార్థులకు వచ్చే నెల మొదటి వారంలో మోటివేషనల్ క్లాసులు నిర్వహించబోతున్నామని తెలిపారు. దీంతోపాటు ప్రతి విద్యార్థికి పరీక్షా కిట్లు అందించబోతున్నట్లు తెలిపారు.పాఠశాలల అభివృద్ధికి గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సిఎస్ఆర్ ద్వారా నిధులు కేటాయించడం పట్ల సంస్థ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సిఎస్ఆర్ విభాగం అధిపతి రఘురామన్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కావ్య కాశిరెడ్డి, ఎంపీటీసీ నీనా చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ విట్టలయ్య, ఎంఈఓ రాథోడ్, రాఘవేంద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్ నాయక్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *