Telangana

ఇంద్రేశంలో జోరుగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు

_తూతూ మంత్రంగా అక్రమ కట్టడం కూల్చివేత

– బిల్డర్లకు అండగా నిలుస్తున్న రాజకీయ నాయకులు

మనవార్తలు ,పటాన్‌చెరు:

సంగారెడ్డి జిల్లా లో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి . రాజధాని హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇళ్ళు ,భవనాలు ,షెడ్లను అక్రమంగా నిర్మిస్తున్నారు. అధికారులు సైతం తూతూమంత్రంగా కొన్ని అక్రమ నిర్మాణాలను, కట్టడాలను కూల్చివేసి చేతులు దులుపుకుంటున్నారు.వివరాల్లోకి వెళ్తే అక్రమ కట్టడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమ కట్టడాల‌ను నిలువరించాల్సిన క్షేత్రస్థాయి అధికారులకు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు అధికమవడంతో చేసేదేమి లేక చేతులెత్తేస్తున్నారు.

జిల్లా అధికార యంత్రాంగం అక్రమ కట్టడాలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఒక న్యాయం. పెద్దలకు ఒక న్యాయామా అని బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశంలో జరుగుతున్న అక్రమ‌ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పలువురు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శనివారం కూల్చివేతలు జరిగాయి. ఈ కూల్చివేతలు‌ కూడా నామమాత్రంగా జరిగాయి. ఇంద్రేశం పంచాయతీ కార్యదర్శి సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం  ఇంద్రేశం గ్రామ పరిధిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన సమాచారం మేరకు కూల్చివేతలు జరిపినట్టు తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవని ఆయన హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కొనుగొలుదారులు కూడా ప్రభుత్వ నిబంధనలతో నిర్మించిన అపార్ట్మెంట్ లలో ఫ్లాట్లు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు…

అదేవిధంగా బిల్డర్లకు, అక్రమ నిర్మాణదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో ప్రభుత్వ పరమైన, అధికారికంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి.  ఏది ఏమైనా ప్రభుత్వ నిబంధనలకు లోబడి అపార్ట్‌మెంట్ నిర్మాణాలు చేపట్టి అటు వినియోగదారులకు, ఇటు కొనుగోలు చేసే వ్యక్తులకు అన్ని విధాలుగా సేఫ్ సైడ్ లో ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఈ అక్రమ నిర్మాణాలను జిల్లా అధికారులు ఏ మేరకు నియంత్రిస్తారో వేచి చూడాల్సిందే.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

9 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

9 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

9 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

9 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

9 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago