మనవార్తలు ,రామచంద్రపురం:
ప్రజలందరి ప్రాణాలను కాపాడటానికి, ప్రజల ఆరోగ్యాలను ఎల్లప్పుడూ కాపాడేందుకు ఎంతగానో శ్రమించే హీరోలే వైద్యులు అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగ రామచంద్రాపురం ఈఎస్ఐ హాస్పిటల్ మరియు ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యులందరికి అందరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు .అనంతరం వైద్య సిబ్బందిని పూలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు .
ఈ సంధర్బంగా ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ మాట్లాడుతూ వైద్యో నారాయణ హరి అంటారు దేవుడు మనకు జన్మనిస్తే ,వైద్యుడు పునర్జన్మనిస్తాడు ప్రస్తుతం దేశాన్ని అల్లోకాల్లోలం చేసిన కరోనా పరిస్థితుల్లో వైద్యులే పోరాటం చేసి ఎందరో ప్రాణాలను కాపాడారు ,రోగి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తమ ప్రాణాలను కుడా లెక్కచేయరని అందుకే ప్రతి సంవత్సరం జులై 1న డాక్టర్స్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందో అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తెలిపారు .ఈ కార్యక్రమంలో ఏకె ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్,అబ్దుల్ గఫార్, కృష్ణమూర్తి చారి, శివ కుమార్, అబ్దుల్ సమీ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…