మనవార్తలు ,రామచంద్రపురం:
ప్రజలందరి ప్రాణాలను కాపాడటానికి, ప్రజల ఆరోగ్యాలను ఎల్లప్పుడూ కాపాడేందుకు ఎంతగానో శ్రమించే హీరోలే వైద్యులు అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగ రామచంద్రాపురం ఈఎస్ఐ హాస్పిటల్ మరియు ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యులందరికి అందరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు .అనంతరం వైద్య సిబ్బందిని పూలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు .
ఈ సంధర్బంగా ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ మాట్లాడుతూ వైద్యో నారాయణ హరి అంటారు దేవుడు మనకు జన్మనిస్తే ,వైద్యుడు పునర్జన్మనిస్తాడు ప్రస్తుతం దేశాన్ని అల్లోకాల్లోలం చేసిన కరోనా పరిస్థితుల్లో వైద్యులే పోరాటం చేసి ఎందరో ప్రాణాలను కాపాడారు ,రోగి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తమ ప్రాణాలను కుడా లెక్కచేయరని అందుకే ప్రతి సంవత్సరం జులై 1న డాక్టర్స్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందో అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ తెలిపారు .ఈ కార్యక్రమంలో ఏకె ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్,అబ్దుల్ గఫార్, కృష్ణమూర్తి చారి, శివ కుమార్, అబ్దుల్ సమీ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…