పటాన్చెరు:
20 సంవత్సరాల పిన్న వయసులో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ద్విచక్ర వాహనంపై ప్రయాణం సాగిస్తూ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్న హైదరాబాద్ రైడర్ ప్రియ నేటి యువతకు ఆదర్శమని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణం శాంతి నగర్ కాలనీకి చెందిన ప్రియ స్వతహాగా బైక్ రైడర్. హైదరాబాద్ నుండి కేదార్నాథ్ వరకు సోలో రైడ్ పూర్తిచేసిన మొట్టమొదటి అమ్మాయి ప్రియా. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ వేయించుకోవాలి అంటూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రారంభించిన రైడ్ పటాన్చెరుకు చేరుకుంది. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శాలువా కప్పి ఆమెకు అభినందనలు తెలిపారు.
ప్రియా సాగిస్తున్న ప్రయాణం నేటి యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం పేరును దేశ స్థాయిలో నిలపడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, వీరా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…