పటాన్చెరు:
20 సంవత్సరాల పిన్న వయసులో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ద్విచక్ర వాహనంపై ప్రయాణం సాగిస్తూ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్న హైదరాబాద్ రైడర్ ప్రియ నేటి యువతకు ఆదర్శమని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణం శాంతి నగర్ కాలనీకి చెందిన ప్రియ స్వతహాగా బైక్ రైడర్. హైదరాబాద్ నుండి కేదార్నాథ్ వరకు సోలో రైడ్ పూర్తిచేసిన మొట్టమొదటి అమ్మాయి ప్రియా. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ వేయించుకోవాలి అంటూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రారంభించిన రైడ్ పటాన్చెరుకు చేరుకుంది. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శాలువా కప్పి ఆమెకు అభినందనలు తెలిపారు.
ప్రియా సాగిస్తున్న ప్రయాణం నేటి యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం పేరును దేశ స్థాయిలో నిలపడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, వీరా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…