మనవార్తలు ,నంద్యాల:
నంద్యాల జిల్లా అయిన తర్వాత హెల్త్ మాఫియా పెట్రేగి పోతుందని నంద్యాల సీపీఐ నేతలు అన్నారు . నంద్యాల సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు మాట్లాడుతూ నంద్యాల కార్పోరేట్ ఆసుపత్రులు నిబంధనలకు విరుద్దంగా చికిత్సలు అందిస్తు రోగులను పీల్చిపిప్పిచేస్తున్నారని మండిపడ్డారు .ప్రతి హాస్పటల్ లో ఏ వైద్యంకు ఎంత ఖర్చు అవుతుందో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు .కార్పోరేట్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీని ఆసరా చేసుకుని పేషంట్లకు అవసరం లేని పరీక్షలు నిర్వహించి వేల వేలు దోచుకుంటున్నారని విమర్శించారు .నంద్యాల డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని రోగులకు లేని జబ్బులు ఉన్నాయంటూ బ్లడ్ టెస్ట్ లు , ల్యాబ్ టెస్ట్ , యాంజియోగ్రామ్ అంటూ ఇతర టెస్ట్ చేస్తు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు .హెల్త్ మాఫియా ఏర్పడి ప్రజలను దోచుకుంటున్నారని..సీపీఐ పార్టీ దీనిపై పోరాటం చేస్తుందన్నారు . నిబంధనలకు విరుద్దంగా ఆపరేషన్లు చేస్తున్న ఆసుపత్రులను డీఎంఅండ్ హెచ్ఓ అధికారులు సీజ్ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…