కుస్తీ పోటీల్లో హరిచరణ్ ఉడుం పట్టు _సిల్వర్ మెడల్ కైవసం

Hyderabad politics Telangana

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : 

చిన్నప్పటి నుండి కుస్తీ పోటీలో శిక్షణ పొందిన ఆ విద్యార్థి సిల్వర్ మెడల్ సాధించి తన సత్తా చాటాడు. ఇందుకు సంబంధించిన వివరాలను స్కూల్ యాజమాన్యం తెలిపింది. శేరిలింగంపల్లి మండల పరిధిలో గల రాయదుర్గం లోని నాగార్జున హై స్కూల్ లో పదో తరగతి చదువుతున్న ఎస్. హరిచరణ్ ఢిల్లీ లో రెజిలింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పోటీలో జూనియర్ చాంపియన్ షిప్ విభాగంలో తన సత్తా చాటి సిల్వర్ మెడల్ ను కైవసం చేసుకున్నాడు. మంచి పట్టుదలతో తన ప్రతిభతో మెడల్ సాధించిన హరిచరణ్ ను నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ భరత్ కుమార్, ప్రిన్సిపాల్ సుందరీలతో పాటు సిబ్బంది అభినందించారు. తన విజయంతో తమ స్కూల్ కు, తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి మంచిపేరు తెచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *