_పెండింగ్ పనుల నిధులు మంజూరు చేయండి
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గత ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం మంజూరైన పనులకు సంబంధించిన 475 కోట్ల రూపాయల నిధులను సత్వరమే మంజూరు చేయాలని, గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.పటాన్చెరువు మండలం కర్ధనూర్ గ్రామంలో శుక్రవారం ఒక కోటి 14 లక్షల 60 వేల రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న ప్రస్తుత తరుణంలో పెండింగ్ బిల్లులను సత్వరమే విడుదల చేయాలని, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. గత దశాబ్ది కాలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా నిలపడంతోపాటు పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు జివిఆర్ ఎంటర్పై సౌజన్యంతో వివిధ కార్యక్రమాల చేపట్టామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ, ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్, పంచాయతీరాజ్ డి ఈ సురేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, గ్రామపంచాయతీ పాలక వర్గం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…