కర్దనూరులో ఒక కోటి 14 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభత్సవాలు

politics Telangana

_పెండింగ్ పనుల నిధులు మంజూరు చేయండి

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గత ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి కోసం మంజూరైన పనులకు సంబంధించిన 475 కోట్ల రూపాయల నిధులను సత్వరమే మంజూరు చేయాలని, గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.పటాన్చెరువు మండలం కర్ధనూర్ గ్రామంలో శుక్రవారం ఒక కోటి 14 లక్షల 60 వేల రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న ప్రస్తుత తరుణంలో పెండింగ్ బిల్లులను సత్వరమే విడుదల చేయాలని, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. గత దశాబ్ది కాలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా నిలపడంతోపాటు పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు జివిఆర్ ఎంటర్పై సౌజన్యంతో వివిధ కార్యక్రమాల చేపట్టామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ, ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్, పంచాయతీరాజ్ డి ఈ సురేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకటరెడ్డి, గ్రామపంచాయతీ పాలక వర్గం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *