పటాన్చెరులో.. మహాశివరాత్రి రోజున మహా జాగరణ..

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాబోయే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పటాన్చెరు పట్టణంలో మహా జాగరణ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మహా జాగరణ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహాశివరాత్రి రోజు సాయంత్రం 8:00 గంటల నుండి అర్ధరాత్రి 12:30 గంటల వరకు వేద బ్రాహ్మణులచే అభిషేకం, శివపార్వతుల కళ్యాణం, లింగోద్భావ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

అనంతరం తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రముఖ గాయకులు ఎస్పి చరణ్, వందేమాతరం శ్రీనివాస్, సునీత, ప్రముఖ యాంకర్ శ్రీముఖి, బిత్తిరి సత్తిల చే సంగీత విభావరి, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు..రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మెరాజ్ ఖాన్, కృష్ణ కాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *