అవార్డు గ్రహీత కు ఘనంగా సన్మానం

Districts politics Telangana

నాగర్ కర్నూల్ ,మనవార్తలు బ్యూరో:

లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాస్థాయి అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు వి .వెంకటేష్ కి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ అంజి లాల్ ఉపాధ్యాయులు విజయ్, పి. అనిల్ అంగన్వాడి టీచర్లు శ్రీమతి సువర్ణ, శ్రీమతి. కృష్ణవేణి , మరియు విద్యార్థులు ఘనంగా సన్మానించి మెమౌంటు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా పాఠశాల విద్యార్థులందరూ కలిసి పాఠశాలలో పనిచేయుచున్న ప్రధానోపాధ్యాయులు అంజి లాల్ కి, ఉపాధ్యాయులు . విజయ్, అనిల్, వెంకటేష్ కు, అంగన్వాడి టీచర్లు అయినా శ్రీమతి సువర్ణ మేడం శ్రీమతి కృష్ణవేణి కు, ఘనంగా సన్మానించనైనది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ బచ్చన్న ఎస్ఎంసి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *