ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రైవేట్ రంగంలో వేల మందికి ఉపాధి కల్పన
యువతకు నైపుణ్యాల కల్పనకు స్కిల్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ కు పట్టం కట్టండి
కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రతిక్షణం నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఒక ఏడాదిలోనే 56వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపే పట్టబద్రులు ఉన్నారని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం పటాన్చెరు నియోజకవర్గంలోని అశోక్ నగర్ సితార గ్రాండ్ లో పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన రాష్ట్ర ఫిషరీస్ సొసైటీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గారితో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. గత పది ఏళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన నిరుద్యోగులకు పెద్దపీటవేస్తూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే 56వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. నిరుద్యోగులకు భరోసా గా నిలబడుతూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.

ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలతో పాటు ఉపాధి కల్పన మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని నిరుద్యోగులు గమనించాలన్నారు. గత నెలలో దావోస్ వేదికగా జరిగిన అంతర్జాతీయ సదస్సులో తెలంగాణకు రూ. ఒక లక్ష అరవై అయిదు వేల కోట్ల పెట్టుబడులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. ప్రైవేట్ రంగంలో యువతకు మెరుగైన వృత్తి నైపుణ్యాలను కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పి అత్యుత్తమ ప్రమాణాలతో వివిధ రంగాలలో శిక్షణ అందిస్తుందన్నారు.
దానికి తోడు విద్యార్థి దశ నుంచే నైపుణ్యాలు పొందేలా ప్రతి నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నెలకొల్పి అత్యుత్తమ విద్యను అందించే విధంగా కృషి చేస్తుందన్నారు. తెలంగాణలోని పట్టబద్రులు చైతన్యవంతులని తమకు అన్ని విధాల న్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి సేవలను వారు అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
గ్రాడ్యుయేట్ ఓటర్లంతా ఉమ్మడి మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు,ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంకుంట అంక్షారెడ్డి , ప్రధాన కార్యదర్శులు రఘురాం శివాంత్ రెడ్డి, షామిలి, పట్టభద్రులు,పటాన్చెరు నియోజకవర్గ మున్సిపల్ అధ్యక్షులు,మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,మహిళా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
