పరిష్కారానికి నోచుకోలేని ప్రభుత్వ పాఠశాలలు – బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదినగూడ ప్రభుత్వ పాఠశాలలో వరద నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ స్థానిక నాయకులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఎన్ని సార్లు పాఠశాలను సందర్శించినా పరిష్కరం కాకపోడం సిగ్గు చేటనీ అన్నారు. వరద ప్రభావితం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో గురువారం రోజు మొదలైన స్కూళ్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు భిన్నంగా మదినగూడ లో డ్రైనేజీ నీళ్ల మధ్యల విద్యార్థులు గడపాల్సిన దుస్థితి వచ్చిందనీ ఆగ్రహం వ్యక్తo చేశారు. ఈ సమస్యే కాదు బస్తీల్లో కూడా చిన్న వర్షాలు కురిస్తే మొత్తం నీటిమయం అయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారనీ అన్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు మేలుకొని ఇలాంటి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ప్రజలే మీకు బుద్ది చెపుతారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, బిజెపి నాయకులు సురేష్ కురుమ, కేవీ, కుమార్, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *