అంబరాన్నంటిన గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్చెరు

టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు తోపాటు అమీన్పూర్, రామచంద్రాపురం, తెల్లాపూర్, పటాన్చెరు మండలాల పరిధిలో స్థానిక నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పటాన్చెరు పట్టణంలోని మహా దేవుని ఆలయం, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని తన సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అనునిత్యం తమ కష్టసుఖాల్లో వెన్నంటి నిలుస్తున్న అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు విజయ్ కుమార్, భారీ సంఖ్యలో అభిమానులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *