అంబేద్కర్ ఆలోచనలే ప్రాతిపదికగా ప్రభుత్వ పాలన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్చెరు

అంబేద్కర్ ఆలోచనల ప్రాతిపదికగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన సాగిస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం పటాన్చెరు పట్టణంలో ని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ విశాలమైన భారతావనిలో ప్రతి ఒక్కరూ సమానత్వంతో ఉండాలన్న సమున్నత లక్ష్యం తో రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు.

బాబాసాహెబ్ ఆలోచనల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. నేటి తరానికి అంబేద్కర్ ఆలోచనా విధానం ఆదర్శనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, పట్టణ అధ్యక్షులు అఫ్జల్, వెంకటేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *