గ్రామ పంచాయతీలకు జీఎంఆర్ ఫౌండేషన్ చేయూత

Hyderabad politics Telangana

పటాన్ చెరు

మాట ఇస్తే మడమతిప్పని నేతగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జిన్నారం మండల పరిధిలోని ఏడు గ్రామపంచాయతీలకు 11 లక్షల రూపాయల విలువైన ట్రాక్టర్ ట్యాంకర్లను అందజేశారు. శనివారం పటాన్చెరు పట్టణ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులకు వీటిని అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సమాజసేవలో జీఎంఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడు ముందు ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలోని 55 గ్రామ పంచాయతీలకు గానూ 45 గ్రామ పంచాయతీలకు జిఎంఆర్ పౌండేషన్ తరఫున ట్రాక్టర్లు, ట్యాంకర్లు అందించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

 

గ్రామ అవసరాలకు అనుగుణంగా వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానంగా హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపిటిసి వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు రాజేష్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *