రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాశివరాత్రి సందర్భంగా నందవరం మండలం గురజాల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో దర్శించుకుని హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పూలతో అందగా ముస్తాబు చేసిన రథంలో రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఊరేగించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామలింగేశ్వరుడి కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ శాంతులు నెలకొనాలని ఆకాంక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవాలకు హాజరైన భక్తులకు అన్ని వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, టిడిపి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.