Telangana

గీతమను సందర్శించిన జర్మనీ ప్రతినిధి బృందం…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం జర్మనీ నుంచి వచ్చిన సమాజ సాధికారత గ్రామీణ సంస్థ ( రోజ్ ) ప్రతినిధులు రాబర్ట్ ఫెల్లెనెర్ , డెటైర్లతో పాటు భారతీయ ప్రతినిధులు- రోజ్ అధ్యక్షుడు వి.శేషయ్య , ఉపాధ్యక్షుడు వె.వి.రావులు సందర్శించారు . ఈ బృందం గీతం గ్రంథాలయం , శివాజీ ఆడిటోరియంలను సందర్శించారు . జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ ఈ పర్యటనను సమన్వయం చేశారు .

ఉన్నత పాఠశాలకు టెక్నాలజీ ల్యాబ్ , సోలార్ సిస్టమ్…

తొలుత , రోజ్ బృందం రుద్రారంలోని ఉన్నత పాఠశాలకు బహుకరించిన పది హెచ్పీ కంప్యూటర్లతో కూడిన టెక్నికల్ లాబ్ , 3 కేవీ సౌర విద్యుత్ వ్యవస్థను రాబర్ట్ ఫెల్లెనెర్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు . కంప్యూటర్ విద్యాబోధన కోసం ఓ స్థానిక వాలంటీరు , నెలకు పది వేల రూపాయల వేతనంతో ఏర్పాటు చేశారు . తాము ఇచ్చిన ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాలని ఆ బృందం ఆకాక్షించింది . మేఘావృతం అయినప్పుడు కూడా విద్యుత్ను ఉత్పత్తి చేయగల సౌర ఫలకాలను తాము అమర్చామని , అదనపు విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానించామని , తద్వారా కొంత మొత్తం ఆదాయం కూడా పాఠశాలకు తిరిగొస్తుందని వారు చెప్పారు . వచ్చే ఏడాది కుట్టు మిషన్లు , కుట్టు పని నేర్పించే శిక్షకుడితో పాటు పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తామని విద్యార్థుల హర్షధ్వానాల మధ్య రోజ్ బృందం హామీ ఇచ్చింది . ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పం ఉపసర్పంచ్ యాదయ్య , పలువురు గ్రామ పెద్దలు , అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు . ఎన్సీసీ అధికారి శంకర్ ఆధ్వర్యంలో ఎన్సీసీ డ్రెస్లో ఉన్న విద్యార్థులతో ఏర్పాటుచేసిన స్వాగతం కార్యక్రమం , పలు శాస్త్ర ( సెన్స్డ్ ) విషయాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన రంగవల్లులు రోజ్ బృందాన్ని ఆకట్టుకున్నాయి .

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago