Telangana

గీతం స్కాలర్ పుష్ప మాచానికి పీహెచ్ డీ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్ధిని పుష్ప మాచానీని డాక్టరేట్ వరించింది. ‘పారిశ్రామికవేత్తల విజయంపె క్లిష్టమెనై విజయ కారకాల ప్రభావం: తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రత్యేక అధ్యయనం’ చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని డాక్టర్ సి.నాగప్రియ, ప్రొఫెసర్ వె.లక్ష్మణ్ కుమార్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. మేఘాలయలోని ఐఐయం షిల్లాంగ్ కు చెందిన ప్రొఫెసర్ సరినీధన త్రిపాఠి బాహ్య పరిశీలకుడిగా వ్యవహరించినట్టు తెలిపారు. పుష్ప పరిశోధన తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై నిర్దిష్ట దృష్టితో పారిశ్రామిక వేత్తల విజయాన్ని ప్రభావితం చేసే క్లిష్టమైన విజయ కారకాలను విశ్లేషించడం లక్ష్యంగా సాగిందన్నారు. ‘ప్రభుత్వ అంశం’, ‘సాంకేతిక అంశం’, ‘సామాజిక అంశాల’ వంటివి చిన్నతరహా సంస్థల పారిశ్రామికవేత్తలను ప్రభావితం చేయ డంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ అధ్యయనం గుర్తించినట్టు పేర్కొన్నారు. సూక్ష్మ వ్యవస్థాపకులు ‘మేనేజ్మెంట్ ఫ్యాక్టర్’, ‘మార్కెట్-సంబంధిత అంశం’ పట్ల గణనీయమైన ఆకర్షణను కనబరిచినట్టు తెలిపారు. మధ్య తరహా వ్యవస్థాపకులు ‘ఆర్ధిక కారకం’, ‘వ్యక్తిగత కారకం’ కోసం ప్రాధాన్యతను ప్రదర్శించారన్నారు. పుష్ప సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

11 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

11 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

11 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

23 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago