గీతం స్కాలర్ మాలతికి పీహెచ్ డీ

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని విసారపు మాలతిని డాక్టరేట్ వరించింది. ‘వన్-పాట్ త్రీ-కాంపోనెంట్ సింథటిక్ విధానాల ద్వారా పైరన్ ఫ్యూజ్డ్ హెటెరోసెక్ట్రిక్ సమ్మేళనాల సంశ్లేషణ’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్ లోని రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.నారాయణరెడ్డి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిశోధన ప్రధాన లక్ష్యల నూతన సెర్టాన్-ఫ్యూజ్డ్ హెటెరో సైక్లిక్ సమ్మేళనాలను సంశ్లేషణ చేయడం, వాటి జీవసంబంధ కార్యకలాపాలను అంచనా వేయడంతో పాటు పరిశోధనలో కనుగొన్న సంభావ్య అనువర్తనాలను ఎత్తిచూపడమన్నారు. ఒక పాట్ మూడు భాగాల ప్రతిచర్యలను మాలతి అభివృద్ధి చేసి, ఆమోదయోగ్యమైన ప్రతిచర్య విధానాన్ని ప్రతిపాదించినట్టు తెలిపారు. ఈ పరిశోధనా ఫలితాలు లోతైన అవగాహనను కల్పించడమే గాక కొత్త యాంటిసెలైఫ్టిక్ ఔషధాల అభివృద్ధికి పునాదిగా పనిచేస్తాయని డాక్టర్ రెడ్డి వివరించారు.మాలతి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ఎ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సెన్స్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, సలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *