Telangana

ఘనంగా గీతం ప్రమాణ-2025 ప్రారంభం

మూడు రోజుల పాటు కొనసాగనున్న విద్యార్థుల వేడుక అలరించనున్న ప్రముఖులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వార్షిక ఉత్సవం. ప్రమాణ-2025 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. సాంకేతిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాల మేలు కలయిక అయిన ఈ వేడుక ప్రారంభోత్సవంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ సీహెచ్, రూపేష్ ముఖ్య అతిథిగా, SYNYCS గ్రూపు ముఖ్య కార్యనిర్వహణాధికారి, వ్యవస్థాపకుడు శ్రహంజ్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు.

విశేషమైన విజయాల కోసం కృషి చేయాలని, అత్యుత్తమ ప్రదర్శనకు తమను తాము సన్నద్ధం చేసుకోవాలంటూ విద్యార్ధులను ఎస్పీ ప్రేరేపించారు. హద్దులను అధిగమించి ఆయా వ్యక్తుల అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా జీవితంలో రాణించాలని శ్రహంజ్ సూచించారు.గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, ప్రమాణ – 2025 అధ్యాపక సలహాదారు డాక్టర్ పి.త్రినాథరావు, డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ప్రతినిధులు, పలువురు అధ్యాపకులు, తదితరులు ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో ఆయా కార్యక్రమాలలో పాల్గొని, ఈ మూడు రోజుల వేడుకను విజయవంతం చేయాలని వారు కోరారు.

ప్రమాణ-2025 తొలి రోజు గీతం నమూనా ఐక్యరాజ్య సమితి (జీఎంయూఎన్), వయ్యారంగా చీర ధరించే కార్యశాల, క్లాసికల్-ఫ్యూజన్ డ్యాన్స్ పోటీలు, రంగోలి పోటీ, లైవ్ పెయింటింగ్-స్వెచింగ్, డిబేటీ పోటీలు, ఓపెన్ మైక్ లతో పాటు పలు వర్క్ షాపులు, రిక్రియేషనల్ థెరపీ, మెంటల్ హెల్త్ బింగో వంటి ఉత్తేజకరమైన సంక్షేమ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ప్రఖ్యాత కళాకారులు నికితా గాంధీ, మంగ్లీ తమ పాటలతో యువతను ఉర్రూతలూగించారు.ప్రమాణ-2025 విద్యార్థులు తమ సృజనాత్మకత, ఆవిష్కరణ, సమగ్రతను ప్రదర్శించడానికి ఒక శక్తివంతమైన వేదికగా ఉంటుందని హామీ ఇవ్వడమే గాక, అవధులు లేని ప్రతిభా స్ఫూర్తిని చాటిచెబుతోంది.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago