గీతమ్ ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం…

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ‘ మానవత్వం కోసం యోగా ‘ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు , అధ్యాపకులు , సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు . తొలుత , గీతం హైదరాబాద్ రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ప్రసంగంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి . యోగా గురించి , రోజువారీ జీవితంలో యోగ సాధన చేయడం వలన కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు . ఆరోగ్యకరమైన శరీరం , మనస్సుల కోసం , అలాగే పనిలో ఒత్తిడిని తగ్గించడానికి నిత్యం యోగ సాధన ఎలా ఉపకరిస్తుందో ఆయన విడమరిచి చెప్పారు .

ఇతర ఔత్సాహిక సాధకులతో కలిసి ఆయన యోగా సాధనలో ఉత్సాహంగా పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ సెన్స్ విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ జీ.ఏ.రామారావు పాల్గొని యోగ సాధనను చేయించడంతో పాటు జీవితంలో యోగా శాస్త్రీయ ఔచిత్యం , ప్రాముఖ్యతలను సాధకులకు వివరించారు . ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గీతం స్పోర్ట్స్ , స్టూడెంట్ లెఫ్ట్ డెరైక్టరేట్ల సౌజన్యంతో ఎన్సీసీ , ఎన్ఎస్ఎస్ యూనిట్ల నిర్వహించాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *