పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
‘నాన్-సర్క్యులర్ జర్నల్ బేరింగ్ పనితీరుపై ఉపరితల ఆకృతి ప్రభావం’ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ బుర్రా భాస్కర్ ను డాక్టరేట్ వరించింది.గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రమేష్ బాబు ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. భాస్కర్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ పట్టా సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హై దరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.ఆర్.శాస్త్రి, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాస్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.