అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ లో గీతం విద్యార్థికి కాంస్య పతకాలు

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో చివరి ఏడాది బీ.టెక్. (సీఎస్ఈ) విద్యార్థి ఎస్.వీరంద్ర ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అరీనాలో నిర్వహించిన ఐదవ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కప్-2026 పోటీలలో రెండు కాంస్య పతకాలు సాధించారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దాదాపు పది దేశాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. సీనియర్ కేటగిరీలో పోటీపడిన వీరంద్ర అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆయనతో పాటు తెలంగాణ బృందంలోని ఇతర సభ్యులు కూడా ప్రతిభ కనబరచి కిక్ లైట్, లైట్ కాంటాక్ట్, జూనియర్ విభాగాలలో బంగారు, వెండి పతకాలను గెలుచుకున్నారు.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. నారాయణరావు చౌదరి తదితరులు వీరంద్ర సాధించిన విజయానికి అభినందనలు తెలియజేశారు. ఆయన అంకితభావాన్ని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీలలో రాణించడానికి కృషి చేయమని ప్రోత్సహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *