మనవార్తలు ,పటాన్ చెరు:
భారతదేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 147 వ జయంతిని పురస్కరించుకుని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) విద్యార్థులు సోమవారం ‘ ఐక్యతా ర్యాలీ’ని నిర్వహించారు . గాంధీ విగ్రహం నుంచి ఆరంభమై గీతం ప్రాంగణాన్ని చుట్టివచ్చిన ఈ ర్యాలీలో విద్యార్థులు , అధ్యాపకులు , సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు . ర్యాలీ ప్రారంభానికి ముందు విద్యార్థులంతా జాతి ఐక్యత , సమగ్రతను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు . దేశ ఐక్యతను పెంపొందించడం , భారతదేశ చరిత్రకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి గురించి అవగాహన కల్పించడం ఈ వేడుక ప్రధాన లక్ష్యంగా ర్యాలీకి నాయకత్వం వహించిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ( యూనిట్ -2 ) డాక్టర్ బిజయ కేతన్ సాహు పేర్కొన్నారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…