హఫీజ్ పెట్:
హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ముఖద్వారం (కమాన్) ను కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ల్ లతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ ప్రకాష్ నగర్ కాలనీ కి రెండు వైపుల ముఖ ద్వారాలు (కమాన్ ) పెట్టడం చాలా అభినందనియం అని, కాలనీ కి వచ్చే కొత్త వ్యక్తులకు స్వాగతం పలుకుతూ ఒక తోరణం లాగా ముఖద్వారాలు పనిచేస్తాయని, కాలనీ లకు గుర్తుగా, ఒక చిరునామా గా పని చేస్తాయని , ముఖ ద్వారాలు కాలనీ ల స్వరూపాన్ని తెలియచేస్తాయని అన్నారు. ప్రకాష్ నగర్ కాలనీ లో ముఖ ద్వారాలు ఏర్పాటు చేసిన బాలింగ్ గౌతమ్ గౌడ్ ను మరియు పులి అరుణ శ్రీనివాస్ గౌడ్ ల ను ప్రత్యేకంగా అభినదించండం జరిగినది. కాలనీ ప్రధాన రోడ్డు వైపు హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షలు బాలింగ్ గౌతమ్ గౌడ్ తండ్రి కీ. శే శ్రీ బాలింగ్ సత్తయ్య గౌడ్ గారి జ్ఞాపకార్థం ముఖద్వారం ఏర్పాటు చేశారు. కాలనీ కి మరో వైపు మంజీర రోడ్డు లో పులి అరుణ శ్రీనివాస్ గౌడ్ ల కుమార్తె కీ.శే దివ్య జ్ఞాపకార్థం ముఖద్వారం ను ఏర్పాటు చేయడం అభినందించ దగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ , ప్రకాష్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాజేశ్వర్ రావు, రమేష్ గౌడ్, బెనర్జీ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
