త్వరలో గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక ప్రారంభం….
– ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు:
90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జిహెచ్ఎంసి నిధులతో పటాన్ చెరు పట్టణ శివారులోనీ చిన్న వాగు సమీపంలో నిర్మించిన గ్యాస్, డీజిల్ స్మశాన వాటికను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో స్మశానవాటిక నిర్వహణపై కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. మనిషి తన జీవితకాలంలో చివరి మజిలీనీ ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుకుంటారని, ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా రుసుములు నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే స్మశాన వాటికకి సంబంధించి ట్రయల్ పనులు సైతం పూర్తయినట్లు తెలిపారు. కరోనా వైరస్ తో మరణించిన మృతదేహాలకు 7500 రూపాయలు, సహజ మరణాల మృతదేహాలకు ఆరువేల రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్మశాన వాటిక ను నిర్మించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డిప్యూటీ కమిషనర్ బాలయ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.