క్రీడాకారులకు ఎల్లవేళలా సంపూర్ణ సహకారం_ రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే క్రీడా పోటీల ద్వారా వాతావరణం వెల్లివిరిస్తుందని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు . పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన రుద్రారం ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలు ఘనంగా ముగిసాయి. రుద్రారం ప్రీమియర్ లీగ్ పోటీలలో రన్నర్ విన్నర్ విజేతలకు 30 వేల రూపాయల మరియు 20 వేల రూపాయల ప్రైజ్ మనీ ట్రోఫీ బహుమతి అందజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రారం గ్రామ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తున్నామని క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక వ్యాయామం లభిస్తుందని తెలిపారు.ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులోనూ నిర్వహించాలని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మన్నే రాజు, హరి ప్రసాద్ రెడ్డి, ప్రముఖ సామాజిక సేవ నేత సాబాద సాయికుమార్, గ్రామ యువ నాయకుడు సత్యనారాయణ రెడ్డి, వార్డు సభ్యులు, క్రీడాకారులు ,గ్రామ ప్రజలు, వివిధ సంఘాల యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *