మన వార్తలు ,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘ ఫ్రెషర్స్ డే ‘ ఉత్సవాన్ని ‘ పార్టీ సెటెమోల్ ‘ పేరిట శుక్రవారం ఘనంగా నిర్వహించారు . స్నేహపూర్వక వాతావరణంలో కొత్త విద్యార్థులను స్వాగతించి , వారి విశ్వాసాన్ని చూరగొనడంతో పాటు వారిలో సృజనాత్మకతను గుర్తించి , ప్రోత్సహించే లక్ష్యంతో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు . సీనియర్లు , జూనియర్లు అనే భేదాన్ని మరిచి , తామంతా ఫార్మసీ విద్యార్థులనే అనే భావన పెంపొందించ డంతో పాటు ఐక్యంగా అంతా ఒక్కటె ఈ వేడుకలను నిర్వహించారు . కొత్త విద్యార్థులను స్వాగతించడానికి సీనియర్లు అనేక సాంస్కృతి కార్యక్రమాలను రూపొందించి , ప్రతి ఒక్కరిలో నిబిడీకృతంగా ఉన్న ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేశారు .
ఆయా పాటలకు తగ్గట్టు విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించడంతో పాటు ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి . మెరిసిపోతున్న దుస్తులలో విద్యార్థులు చేసిన ర్యాంప్ వాక్ ఉత్సవానికే మకుటంగా నిలిచింది . తొలుత , గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , సెన్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు జ్యోతి ప్రజ్వలన , ప్రేరణోపన్యాసాలతో ఈ ఫ్రెషర్స్ డే వేడుకలను ప్రారంభించారు . ఫార్మసీ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ తన స్వాగతోపన్యాసంలో విద్యార్థుల కృషిని అభినందించారు . పసందెన విందుతో ఈ ఒక్కరోజు వేడుకలు విజయవంతంగా ముగిశాయి .
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…