పటాన్ చెరు
ఆపదలో ఉన్నవారికి ఆదుకొంటు అడిగిన వారికి లేదు అనకుండా సహాయం చేస్తూ సేవే లక్ష్యంగా ముందుగు సాగుతున్న పటాన్ చెరు మాజీ సర్పంచ్ ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు.దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుండే దేవేందర్ రాజు మరోసారి తన దైవభక్తిని చాటుకున్నారు .సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని పటేల్ గూడా గ్రామ పంచాయతీలో గల బి హెచ్ ఈ ఎల్ కార్మికుల కాలనీ కు సంబంధించిన మెట్రో ఎన్ క్లేవ్ మరియు ఇతర కాలనీల దారిలో
శ్రీ శ్రీ శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం నిర్మాణానికి పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ భక్తుని అలవాటు చేసుకోవాలి సూచించారు.
తద్వారా మనశ్శాంతిని పొందుతారని, రోజువారి నిర్వహించే పనుల్లో విజయవంతంగా ముందుకు పోయే అవకాశం ఉంటుందన్నారు. దేవుడి ఆశీస్సులతో మానసిక ప్రశాంతతతో ప్రతి ఒక్కరూ సుఖవంతమైన జీవితాన్ని గడపాలని ఆయన ఆకాంక్షించారు. హనుమాన్ ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ ఈర్ల దేవానంద్, పటేల్ గూడా సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్, ఐఎన్టీయూసీ జిల్లా నాయకులు దామోదర్ రెడ్డి, మెట్రో ఎన్ క్లేవ్, సూర్యోదయ కాలనీ వాసులు పాల్గొన్నారు.
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : బీసీ రిజర్వేషన్ బిల్లు తెరపైకి తేవడం కాంగ్రెస్ యొక్క మోసపూరితమైన కుట్ర అని మాజీ…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నేడు నిరుపేదలకు వరంగా మారాయని పటాన్చెరు శాసన…
పటాన్చెరులో ఘనంగా మిస్సైల్ మాన్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : అత్యంత సామాన్య కుటుంబం…
పటాన్చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం…
ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర, జాతీయ స్థాయి…
గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు పటాన్చెరు…