ముందే చెప్పాం.. అమలు చేశాం.. సాధించాం
మీ వెనుక నేనున్న.. అభివృద్ధిలో ముందుకు సాగండి
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసి మెప్పు పొందండి
నూతన మున్సిపల్ పాలకవర్గాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ అభినందన సందేశం
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరవేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టినరోజు కానుకగా అందించామని ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని ఇందుకు సహకరించిన కార్యకర్తలకు సంపూర్ణ నమ్మకంతో ఆశీర్వదించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాలులో ఇటీవల నూతనంగా ఎన్నికైన గడ్డపోతారం, జిన్నారం, ఇంద్రేశం మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ వారిని ఘనంగా సన్మానించి అభినందించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములు అత్యంత సహజమని ప్రజలు నమ్మకంతో గెలిపించిన ప్రజాప్రతినిధులందరూ ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధి సంక్షేమాల అంశంలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. ఇందుకు తాను ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఐదు మున్సిపాలిటీల అభివృద్ధికి 15 కోట్ల రూపాయలు చొప్పున నిధులు సిద్ధంగా ఉన్నాయని అతి త్వరలో ఇందుకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేద్దామని తెలిపారు.ప్రతిపక్షంలో ఉన్నప్పటికిని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై పటాన్చెరు ప్రజలు ఎల్లప్పుడూ తమ నమ్మకాన్ని కొనసాగిస్తున్నారని ఇందులో భాగంగా ఐదు మున్సిపాలిటీలలోనూ. బిఆర్ఎస్ పార్టీని నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించారని అన్నారు. రాబోయే ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లోను క్లీన్ స్వీప్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు
