శేరిలింగంపల్లి :
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ హక్కుల సాధన కొరకు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద చేపట్టిన రెండురోజుల రిలే నిరాహార దీక్ష కార్యక్రమo మొదటి రోజైన సోమవారం రోజు దీక్ష విజయవంతం అయిందని సంఘం సభ్యులు తెలిపారు. వడ్ల సుదర్శన చారి ఆధ్వర్యంలో మొదటిరోజు భారీ ఎత్తున విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రిలే నిరాహార దీక్షను జయప్రదం చేసిన విశ్వకర్మ సోదరులందరికీ, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇందులో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు జి ప్రసాద్ కుమార్, మరియు దాసోజు శ్రవణ్ కుమార్, యు.జి.సి అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ లు హాజరయ్యారు. మొదటి రోజు దీక్షలో కూర్చున్న సభ్యులు వడ్ల సుదర్శన చారి, కంజర్ల కృష్ణమూర్తి, బచ్చల పద్మ చారి, పొన్నాల, మోత్కూరీ వీరభద్రా చారి, వడ్ల మహేందర్, వడ్ల చిరంజీవులు మల్లెల అనంత చారి, లత, సంగారెడ్డి సరిత, భరత్ చారి, దినేష్ చారి, రాంబ్రహ్మం చారి, రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…