హైదరాబాద్
మాంసం విక్రయ సంస్థ …ఫిపోలా తెలంగాణలో తమ సేవలను విస్తరించింది. తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఫౌండర్ సుశీల్ తెలిపారు .వచ్చే ఏడాదిలోగా దక్షిణ భారత దేశంలో 64 ఔట్ లెట్లు ఏర్పాటు చేస్తామని… ..2022 లోగా దేశ వ్యాప్తంగా రెండు వందల స్టోర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు . మాంసం సీఫుడ్ తో పాటు ఐదు వందల రకాల మాంసపు ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. నాణ్యమైన ,తాజా మాంసంను నేరుగా వినియోగదారుడికి అందిస్తున్నట్లు సీఓఓ అంజోయ్ కుమార్ దాస్ తెలిపారు .
హైదరాబాద్ లో ఫిపోలా ఔట్ లెట్లు బంజారాహిల్స్, మాదాపూర్ ,చందానగర్ ,హిమాయత్ నగర్ ,కూకట్ పల్లి,కొండాపూర్ , ప్రగతి నగర్ ,బేగంపేట్, మణికొండ, దిల్ సుఖ్ నగర్ , అత్తాపూర్ ,కొత్తపేట్, గచ్చిబౌలి, శంషాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు. ఐదేళ్ళ ప్రస్థానంలో చెన్నై,కోయంబత్తూర్ ,హైదరాబాద్ లలో 36 ఔట్ లెట్లను ఏర్పాటు చేశామని సుశీల్ తెలిపారు .ఫిష్, ఫౌల్డ్రీ, మేక,గొర్రె నాణ్యమైన మాంసంను వినియోగదారులకు అందిస్తామని హామి ఇచ్చారు.
ఫిపోలా యాప్ డౌన్ లోడ్ చేసుకుని యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు ఆపర్లు,లాయల్టీ పాయింట్లు అందిస్తామని సుశీల్ తెలిపారు .సిగ్వీ,డోన్జో వంటి యాప్ ల ద్వారా తమ ఉత్పత్తులను ఇంటికి డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు .దీంతో పాటు తాము సొంతగా డోర్ డెలివరీ చేస్తామన్నారు .
తమిళనాడు రాష్ట్రంలో 8 ఫిపోలా గ్రిల్ హౌస్ లను ఏర్పాటు చేశామని… త్వరలో హైదరాబాద్ లో కూడా గ్రిల్ హౌస్ లను ఏర్పాటు చేస్తామన్నారు .
తమ స్టోర్ లో తాజా మాంసంతో పాటు చికెన్ ,ఫిష్ , మటన్ ,విదేశాలకు చెందిన సీ ఫుడ్ , ఇతర మసాలా పౌడర్లు, మాంసపు ఉత్పత్తులు పిఫోలా స్టోర్లలో అందుబాటులో ఉంచామన్నారు . తమ వద్ద ఆర్డర్ చేసిన కస్టమర్లకు 120 నిమిషాల్లో డోర్ డెలివరీ చేసే వెసలు బాటు కల్పించామన్నారు . ప్రస్తుతం తమ సంస్థలో 330 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని …త్వరలో 710 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…