రూ 30,000 అందజేసిన సర్పంచ్ నీలం మధు గారు
చిట్కుల్
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారు చికిత్స నిమిత్తం తన వంతుగా 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. రామచంద్రపురం పరిధిలోని ఎంఐజి ఫేస్-2 కు చెందిన ఎం.గౌతమ్, స్రవంతి దంపతుల కుమారుడు ఎం.గౌతమ్ వెలిమెలలోని తెలంగాణ మోడల్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి. తమ కుమారుడి వైద్యం కోసం సహాయం కోరగా గురువారం తన నివాసంలో సర్పంచ్ నీలం మధు గౌతమ్ తల్లిదండ్రులకు ఆర్థిక సహాయాన్ని అందజేసి మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు. బాలుడు గౌతం త్వరగా కోలుకోవాలని, భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.