మనవార్తలు ,తెల్లాపూర్:
ఓ పూట ఆకలి తీర్చొచ్చు. విద్యా దానం చేస్తే.. జ్ఞానం పంచొచ్చు. అదే రక్తదానం చేస్తే.. ప్రాణదాతలు కావొచ్చు. అందుకే అన్ని దానాలంటే కంటే రక్తదానం గొప్పదంటారు. రక్తదానం చేయండి చేయించండి అని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహేష్ పుట్టిన రోజు సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రా నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని ఆమె ప్రారంభించారు .అనంతరం కాట సుధా శ్రీనివాస్ గౌడ్ రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానం అని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరారు.రక్తదానం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని తెలిపారు. యూత్ సభ్యులు దాదాపుగా 30 మందికి పైగా రక్తదానం చేయడాన్ని కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు ,మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, సి ప్రభాకర్ రెడ్డి, నరసింహ, నరేందర్, సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…