గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ

politics

గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి
– నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ
– డంపు యార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్

పటాన్ చెరు:

పటాన్ చెరు జీహెచ్ఎంసీ పరిధిలోని డంపు యార్డులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం మేయర్ కూకట్ పల్లి నుండి పటాన్ చెరు పట్టణానికి సందర్శించి, పనులను పరిశీలించారు. చెత్త సేకరణ, విసర్జన, పారిశుధ్య కార్మికుల పనితీరు తదితర అంశాలను స్థానిక ఉప కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ నగరాన్ని గ్రీన్ హైదరాబాద్ గా మార్చేందుకు ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని అన్నారు. ప్రజలందరూ పరిశుభ్రతను పాటించాలని సూచించారు. పట్టణంలో పరిశుభ్రత పరవాలేదని, మరింత పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పట్టణ ప్రజలందరూ చెత్తను జీహెచ్ఎంసీ ఆటోలోనే వేయాలని తెలిపారు. చెత్తను తీసుకువెళ్లేందుకు ఆటో వారికి మీకు తోచిన విధంగా డబ్బులు ఇవ్వాలని సూచించారు.

అనంతరం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ డివిజన్ పరిధిలోని సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. పారిశుధ్య కర్మికుల సిబ్బంది కొరతను వివరించారు. ఇంతకు ముందు బండ్లగూడ గ్రామం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా 2 సంవత్సరాల క్రితం పటాన్ చెరు డివిజన్ లో విలీనం చేయడం జరిగింది. కావున తగినంత సిబ్బందిని నియమించాలని కోరారు. నూతనంగా కలిసిన బండ్లగూడ గ్రామంతో చెత్త సేకరణకు తగినన్ని వాహనాలు లేవని కాబట్టి పారిశుధ్య పనులు సజావుగా సాగేందుకు 30 స్వచ్చ ఆటోలను, 20 స్వచ్చ రిక్షాలను, 30 చెత్త తోపుడు బండ్లు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.

బండ్లగూడ గ్రామానికి డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని అన్నారు. బండ్లగూడ గ్రామం డివిజన్ లో విలలీనమయినప్పటికి అక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు పాత వేతనం రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారని, కావున పటాన్ చెరు లోని పారిశుధ్య కార్మికులతో పాటు సమానవేతనం రూ.17 వేలు మంజూరు చేయగలరని వినతి పత్రం అందజేశారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలో దేశం లోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారని అందులో కార్మికులే ఎక్కువగా ఉన్నందున వారు తమ పనులకు వెళ్లేందుకు జాతీయ రహదారిని దాటి బస్ స్టాండ్ కు వెళ్ళవలసి వస్తుంది.

ఇలా రోడ్డు దాటే క్రమంలో చాలామంది ప్రమాదాలకు గురైయ్యారని, ప్రాణాలు కూడా కోల్పోయారు. కావున బస్ స్టాండ్ పరిధిలో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నియమిస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారవుతారని మేయర్ కు కార్పొరేటర్ విన్నవించారు. డివిజన్ లోని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ మేయర్ ఇచ్చారు. మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ బాలయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగరి అశోక్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు అఫ్జల్, టిఆర్ఎస్ నాయకుడు సందీప్ తదితరులు ఉన్నారు.