ఆలయ నిర్మాణాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి_ బీఆర్ఎస్ నాయకులు నీలం మధు ముదిరాజ్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని బీఆర్ఎస్ నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణానికి ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సాయంగా రెండు లక్షల రూపాయలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఆధ్యాత్మిక వాతావరణంలో పల్లెలు ,పట్టణాలు అభివృద్ధి చెంది సుఖసంతోషాలతో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చుంచు రేణుక స్వామి,ఎంపీటీసీ పార్వతమ్మ,ఉప సర్పంచ్ తీగల సత్తయ్య, అశోక్, శివకుమార్, కనకరాజు,భాస్కర్ ,శ్రీకాంత్, సంతోష్,శేఖర్, గ్రామ పెద్దలు, ప్రజలు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సైతం దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో కేసీఆర్ ఆలయాల అభివృద్ధి పెద్దపీట వేశారని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *