నందిగామ హరితహారంలో మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం తోపాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని శాసనమండలి ప్రోటేమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామం లో హరితహారం కార్యక్రమానికి చైర్మన్ భూపాల్ రెడ్డి తోపాటు,మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్మన్ భూపాల్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరిత హారం కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయిఅని తెలిపారు. రోజు రోజుకి కుచించుకుపోతున్న అటవీ ప్రాంతాన్ని పెంపొందించాలంటేవిధిగా మొక్కలు నాటవలసిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. నందిగామ గ్రామంలో హరితహారం కార్యక్రమం ద్వారా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడంపట్ల స్థానిక ప్రజా ప్రతినిధులను ఆయన అభినందించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు కాలుష్యానికి చిరునామా గాపేరొందిన పటాన్చెరు ప్రాంతం నేడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూప్రతి గ్రామం, పట్టణం పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేస్తూ ప్రతి ఇంటికి ఆరు ముక్కల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాన్ని 100% సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…