మనవార్తలు ,హైదరాబాద్:
సత్యసాయిలో జాతీయ చేనేత పట్టు వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన షరూ క్రాప్ట్స్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుజరాత్ నేతృత్వంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగమంలో ఏర్పాటైన 6 రోజుల రోజుల జాతీయ చేనేత.. పట్టు ఉత్పత్తుల వస్త్ర ప్రదర్శన ను మిసెస్ ఇండియా తెలంగాణ క్రౌన్ విజేత పూజిత వినయ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ సంస్కృతి లో సిల్క్ హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందనీ, నేటికి వాటిపై వన్నె తగ్గలెదన్నారు. దేశంలో ని పలు నగరాల చేనేత కారులు ఒకే వేదికలో హ్యాండ్ లూమ్ వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం అభినందనీయమని ఆమె అన్నారు.నిర్వాహకులు జయేష్ మాట్లాడుతూ ఏప్రిల్ 25వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో దేశం లోని 14 నగరాల నుండి చేనేత కారులు , చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు, డ్రెస్ మెటిరియల్ వంటి 50 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులొ ఉంచారని వివరించారు.