పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రముఖ కళాకారిణి డాక్టర్ నీనా ప్రసాద్ మోహినియాట్టం నృత్య ప్రదర్శన ఆసొంతం మనోహరంగా సాగి ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో మంగళవారం ఈ ప్రదర్శనను స్పిక్ మెకే హెరిటేజ్ క్లబ్ సహకారంతో స్టూడెంట్ లైఫ్ డైరెక్టరేట్ నిర్వహించింది.గురువుకు నివాళిగా చొల్కెట్టుతో శాస్త్రీయ నృత్య పారాయణం ప్రారంభమైంది. తర్వాత వసుంధర సుందర ధార భూమి ప్రదర్శన గాత్రానికి తగ్గ అభినయంతో అలరించింది. ఆ తరువాత ప్రతిభా రే రచించిన పద వర్ణన’తో కొనసాగి, తిల్లానా’తో ముగిసి, ప్రేక్షకులను ఆనంద డోలికల్లో ముంచేసింది.మాధవన్ సంపూత్రి సీపీ (గానం), రమేష్, బాబు కేపీ (మృదంగం), అరుణ్ దాస్ సీపీ (ఇడక్క), కోలంక సాయికుమార్ (వయోలిన్) తదితరులు డాక్టర్ వీనా ప్రసాద్ కు సహకారం అందించారు.మోహినియాట్టం పారాయణం వంటి కార్యక్రమాల ద్వారా మనదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రచారం చేయడం గీతం, హైదరాబాద్ కొనసాగిస్తోంది.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…