రైతుల ఆర్థిక అభ్యున్నతికి కృషి

politics Telangana

రుద్రారంలో పిఎసిఎస్ దుకాణాల సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునికతను జోడించి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.రైతుల ఆర్థిక అభ్యున్నతికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు దన్నుగా నిలవాలని ఆయన కోరారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని పిఎసిఎస్ ఆవరణలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన దుకాణాల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని రైతులు పండించిన పంటల నిలువ కోసం ఆధునిక గోదాములు నిర్మించడం జరిగిందని తెలిపారు. దుకాణాల సముదాయాలు ద్వారా పిఎసిఎస్ లకు ఆర్థిక లభ్యత పెరుగుతుందని తెలిపారు. రానున్న వర్షాకాలంలో అర్హులైన రైతులకు. రుణాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు ఆర్థిక అభ్యున్నతిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో హాజరైన పిఎసిఎస్ చైర్మన్ పాండు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, రాజు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, పాలక మండలి డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *