ఫార్మాస్యూటికల్ పరిశోధనలో డాక్టర్ ఆంజనేయులుకు పీహెచ్.డీ

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థి పాటంశెట్టి ఆంజనేయులును డాక్టరేట్ వరించింది. ‘ఎంచుకున్న ఔషధాల (ఇరినోటెకాన్, సునిటినిబ్) మెరుగైన క్యాన్సర్ నిరోధక సామర్థ్యం కోసం అల్ట్రాసౌండ్-ఆధారిత నానోబబుల్ ఔషధ పంపిణీకి మార్గదర్శనం’ అనే అంశంపై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.కొలొరెక్టర్ క్యాన్సర్ చికిత్సలో వైద్యపరంగా ఆమోదించబడిన క్యాన్సర్ నిరోధక మందులు, ఇరినోటెకాన్, సునిటినిబ్ ల చికిత్సా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి డెక్ర్స్టాన్-ఆధారిత, అల్ట్రాసౌండ్-ప్రతిస్పందించే నానోబబుళ్లను అభివృద్ధి చేయడంపై డాక్టర్ ఆంజనేయులు పరిశోధన దృష్టి సారించినట్టు తెలియజేశారు. ఈ అధ్యయనం గణనీయంగా మెరుగైన ఔషధ విడుదల, జీవ లభ్యత, క్యాన్సర్ నిరోధక కార్యకలాపాలను, తగ్గిన దైహిక విషప్రక్రియను ప్రదర్శించిందన్నారు.ఈ పరిశోధన ఫలితాలు నానోబబుల్-సహాయ ఔషధ పంపిణీని లక్ష్య, ఉద్దీపనలకు ప్రతిస్పందించే క్యాన్సర్ చికిత్సకు ఒక ఆశాజనక వేదికగా నిర్ధారిస్తాయని, భవిష్యత్తులో క్లినికల్ అనువాదానికి బలమైన సామర్థ్యాన్ని అందిస్తాయని వివరించారు.డాక్టర్ ఆంజనేయులు సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *