అన్నదానం కోసం రెండు క్వింటాళ్ల బియ్యం అందజేత

Hyderabad politics Telangana

మనవార్తలు ,  శేరిలింగంపల్లి :

శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి తమ ఫౌండేషన్ తరపున కుత్బుల్లాపూర్ మండలం లోని జీడిమెట్ల లో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో ఈ నెల 20 వ తేదీన జరగనున్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో అన్నప్రసాదం కొరకు కృష్ణమూర్తి చారి 2 క్వింటాళ్ల బియ్యం విరాళంగా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సుచిత్ర గోపాల్ చారి, శేఖర్ చారి, ,రాజేందర్ చారి, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *