అమర్నాథ్ రెడ్డికి డాక్టరేట్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

”అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల ద్వారా పోర్ట్ఫోలియో మేనేజ్ మెంట్ సేవలపై పెట్టుబడిదారుల అవగాహన అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్ మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి బి.అమర్నాథ్ రెడ్డిని డాక్టరేట్ వరించింది.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ హెదరాబాద్ పూర్వ ప్రొఫెసర్ ఎ.శ్రీరామ్: సుంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.పెట్టుబడిదారుల ముందస్తు కొనుగోలు అవసరాలు, కొనుగోలు అనంతర సేవలు, ప్రమాద అవగాహన, వార్షిక నిర్వహణ సదుపాయాలను అందించే పోర్ట్ఫోలియో మేనేజ్ మెంట్ సేవలపై, పెట్టుబడిదారులు నిర్ణయాలపై వాటి ప్రభావాన్ని ఈ అధ్యయనంలో విశ్లేషించినట్టు తెలిపారు.

పోర్ట్ఫోలియో మేనేజ్ మెంట్ సేవల్లో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయాలు తీసుకునే ముందు, కొనుగోలుకు : ముందు, ఆ తరువాత అవసరాలను జాగ్రత్తగా విశ్లేషించాలని పెట్టుబడిదారులకు సూచించామని, అలాగే ప్రమాద విశ్లేషణ మొత్తం సంతృప్త స్థాయిలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని కనుగొన్నానున్నారు.అమర్నాథ్ రెడ్డి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డెరెక్టర్ డీఏసీఎస్ఆర్ వర్మ, గీతం బిజినెస్ స్కూల్-హెదరాబాద్ డెరైక్టర్లు ప్రొఫెసర్ వినయ్ కుమార్ అప్పరాజు, ప్రొఫెసర్ టి.కరుణాకర్, పలు: విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *