మన వార్తలు ,పటాన్చెరు:
గ్యాస్ సెన్సార్ వినియోగం కోసం జింక్ ఆధారిత లోహ సేంద్రియ విధానంలో నానో మిశ్రమాల సంశ్లేషణ, ఆనవాలు లక్షణ చిత్రణ అనే అంశంపై అధ్యయనం, విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి ఎ.జగన్మోహన్ రెడ్డి ని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్ లోని రసాయన శాస్త్ర ప్రొఫెసర్లు డాక్టర్ ఎం.ఎస్.సురేంద్రబాబు, డాక్టర్ నరేష్ కుమార్ కటారిలు శుక్రవారం వెల్లడించారు.
సంశ్లేషణ, అత్యంత సున్నితమైన, వేగంగా తిరిగి పొందగలిగే శీఘ్ర ప్రతిస్పందన గ్యాస్ సెన్సార్లు ఈ పరిశోధన లక్ష్యమన్నారు. అధిక ఎంపికతో తక్కువ ప్రతిస్పందన సమయం కోసం పరిశోధనలు విశ్వవ్యాప్తంగా పురోగతిలో ఉన్నాయని, కొత్త గ్యాస్ సెన్సార్ల అభివృద్ధికి పరిశోధన చాలా అవశ్యమని వారు తెలిపారు. గ్యాస్ సెన్సింగ్ అధ్యయనాల కోసం అమ్మోనియా, ఫార్మాల్డిహెడ్జ్, ఇథనాల్, ఆసిటోన్, టోలున్, జిలీన్ ఆవిరిని ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సెర్చ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు అభినందించినట్టు వివరించారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…